చెన్నై సూపర్ కింగ్స్
గెలవాలని ముంబై ఇండియన్స్ అభిమానులు, ముంబై ఇండియన్స్ గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్
అభిమానులు వేడుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబై
ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కు గుర్తింపు ఉంది. ఈ రెండు
జట్ల మధ్య పోటీ అంటే అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ ఓ రేంజ్లో ఉంటుంది. మా జట్టు
గొప్పంటే మా జట్టు గొప్ప అని ఫ్యాన్స్ చెప్పుకుంటుంటారు. అంతే కాదు ధోనీని ముంబై
ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే రోహిత్ను చెన్నై ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తుంటారు. కానీ
ఆదివారం మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరుపై చెన్నై గెలుస్తుంటే ముంబై ఫ్యాన్స్ ఆస్వాదించగా రాజస్థాన్ చేతిలో ముంబై
ఓటమి చెన్నై అభిమానులను బాధించింది. ఒక జట్టు విజయాలు మరో జట్టును ప్రభావితం
చేయడమే దీనికి కారణం. చెన్నైపై బెంగళూరు విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో కోహ్లి
సేన 16
పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకునేది.
ఇందువల్ల టాప్లో ఉన్న
ముంబై ఇండియన్స్ రెండో స్థానానికి పడిపోయేది. కానీ చెన్నై విజయంతో ముంబై ఇండియన్స్
పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్తో జరిగిన
మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవాలని చెన్నై ఫ్యాన్స్ కోరుకున్నారు. ముంబై గెలిస్తే
చెన్నై ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలు సజీవంగా ఉండేవి. దీంతో సూపర్ కింగ్స్ ఫ్యాన్స్
ముంబైకి మద్దతుగా నిలిచారు. హార్దిక్ పాండ్య సిక్సులు బాదుతూ మెరుపులు మెరిపిస్తే
ఆనందించారు. కానీ బెన్ స్టోక్స్ అజేయ శతకంతో 196 పరుగుల లక్ష్యం కరిగిపోవడంతో ముంబైతోపాటు చెన్నై
అభిమానులు సైతం నిరాశ చెందారు. ముంబై ఓటమితో తమ ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారడంతో
చెన్నై ఫ్యాన్స్ కలత చెందారు. చెన్నై గెలవాలని ముంబై ఫ్యాన్స్ కోరుకోవడం ముంబై
గెలవాలని చెన్నై ఫ్యాన్స్ ప్రార్థించడం ఐపీఎల్లో బహుశా ఇదే తొలిసారని నెటిజన్లు
కామెంట్లు పెడుతున్నారు. అందరూ ఎదురు చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ప్లే ఆఫ్
కు చేరాక పోవడంతో అభిమానులంతా చాలా నిరాశకు లోనైయ్యారు.