తెలంగాణ గవర్నర్ పై ట్విట్టర్ లో ఎమ్మెల్యే సైదిరెడ్డి విరుచుకు పడ్డారు. తెలంగాణ గవర్నర్ బీజేపీ అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విరుచుకు పడ్డారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ట్వీట్స్ చేశాడు.
దేశ వ్యాప్తంగాను మరియు రాష్ట్ర వ్యాప్తంగాను అనేక పథకలకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్ మాడల్ అని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలోని మా పథకలను మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే అనేక గ్రామాలలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు.