గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవస రంలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీఆర్ఎస్ తమమద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తామని, ప్రస్తుతానికైతే ఈ పార్టీ నుంచి తమనెవరూ సంప్రదించలేదన్నారు.
‘బీజేపీది బలం అని నేను అనుకోవటం లేదు. బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నకరీంనగర్లో మేయర్, డిప్యూటీ మేయర్లుగా బీజేపీ వారిని గెలిపించుకోలేకపోయారు. మరో ఎంపీ అరవింద్ నిజామాబాద్లో ఇలాగే విఫలమయ్యారు. కొన్ని తాత్కాలిక పరి స్థితుల ప్రభావంతో ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది.
దక్షిణ భారత్లో సత్తా ఉన్న నేతల్లో కేసీఆర్ ఒకరు. భవిష్యత్తులోనూ తెలంగాణ జనం ఆయనకు అనుకూలంగా ఉంటారనే విశ్వ సిస్తున్నా’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.