తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విషెస్ తెలిపిన మెగాస్టార్


తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ విషెస్ తెలియజేసారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ప్రభుత్వం నిరాడంబరంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సినీ ప్రముఖులు తెలంగాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు విషెస్ చెప్పారు.

ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా,దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ KCR గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ హరీష్ ట్వీట్ చేశారు. మెగా బ్రదర్, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ సైతం తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

మోదీ , రాష్ట్రపతి సైతం తెలంగాణ ప్రజలకు శుభాకంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు విషెస్ తెలుపుతూ తెలుగులోనే ట్వీట్ చేశారు మోదీ. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.