అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు వారికి స్వామివారి పట్టు వస్త్రాలను అందజేశారు. నాదనీరాజనం వేదికపై సుందరకాండ పఠనంలో ఆయన పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం ఆనందాన్ని కలిగించిందని సీఎం శివరాజ్సింగ్ చెప్పారు. దేశం స్వయం సమృద్ధి సాధించాలని, కరోనా నుంచి దేశం విముక్తి పొందాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్ దిశగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.