క్యాన్సర్తో పోరాడుతూ
సోమవారం ప్రముఖ తమిళ హాస్యనటుడు 'తవసి' మరణించారు.
క్యాన్సర్తో పోరాడుతూ వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక సహాయాన్ని అర్థించిన
ప్రముఖ తమిళ హాస్యనటుడు 'తవసి' కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాడి ఓడిన తవసి సోమవారం
సాయంత్రం మదురైలోని హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. తవసి బక్కచిక్కిపోయిన ఆకారం
చూసి తమిళ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు షాక్కు గురయ్యారు. ఆయన కోలుకోవాలని
ఆకాంక్షించారు. దేవుడిని ప్రార్థించారు. కానీ, ఆ ప్రార్థనలు ఫలించలేదు. అతని ప్రాణాలు నిలవలేదు.
తమిళంలో 140
సినిమాలకు పైగా నటించిన అతను దీన స్థితిలో మరణించడం అందరినీ కలచివేస్తోంది. నిజానికి అతని పరిస్థితి గురించి తెలియడంతో
కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే, సూపర్
స్టార్ రజినీకాంత్ కూడా తవసి వైద్యానికి ఆర్థిక సాయం అందించారు. వీరందిరి సాయంతో
అతనికి మెరుగైన వైద్యం అందుతుందని అందరూ
భావించారు. కానీ, తవసి పరిస్థితి బయట ప్రపంచానికి తెలిసిన కొన్ని
రోజులకే ఆయన కన్నుమూయడం బాధాకరం.
అతని మరణం అందరూ
అభిమానులను షాక్ కు గురిచేసింది. నిజానికి అతని ఆరోగ్యం బాగోకపోవడంతో డైరెక్టర్
శరవణ శక్తి ఆయన్ని చికిత్స నిమిత్తం డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ దగ్గరకి
తీసుకెళ్లారు. అతనికి క్యాన్సర్ అని తేలడంతో అప్పటి నుంచి శరవణన్ హాస్పిటల్లో
వైద్యం అందిస్తున్నారు. అతని పరిస్థితి గురించి డాక్టర్ శరవణన్ సైతం సోషల్
మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. తవసి వైద్యానికి తాను కొంత ఆర్థిక సాయం
చేశానని కోలీవుడ్ హీరోలు ముందుకు రావాలని శరవణన్ కోరారు. కానీ, ఇంతలోనే
అతను కన్నుమూశారు. ఇదిలా ఉంటే, ‘వరుత్తపడాద
వాలిబార్ సంగం’, ‘సీమరాజా’, ‘రజినీమురుగన్’ తదితర చిత్రాల్లో తవసి నటించారు.
‘వరుత్తపడాద వాలిబార్ సంగం’ సినిమాలో తవసి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు
లభించింది. ఆ సినిమాలో నటుడు సూరికి తవసి తండ్రిగా నటించారు. కాగా, అతని
మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ
ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నటులందరూ సహాయం చేడంవల్ల అతను కోలుకుంటాడని
అందరూ ఊహించారు.