భారత్లో చైనాకు చెందిన
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇవాళ
కొత్త ఫోన్ను విడుదల చేసింది. ఆన్లైన్ లాంచ్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. భారత్లో
ఫోన్ ధర రూ.34,990గా ఉంది. ఆగస్టు 5 నుంచి విక్రయాలు ప్రారంభించనుంది.
స్టార్రి నైట్, సిల్కీ
వైట్ రెండు కలర్లలో వస్తున్నది. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ను మాత్రమే విడుదల చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్
స్టోరల్లో ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయని కంపెనీ పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం
మాల్, స్నాప్డీల్
తదితర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా వినియోగదారులు ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.