తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసిన..తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇప్పటికే విస్తృతం అభిప్రాయ సేకరణ జరిపారు.
ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు.. ఇలా అందరితో సమావేశమై పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు చేశారు. ఈ రిపోర్టును హైకమాండ్కు నివేదించనున్నారు ఠాగూర్. ఆ తర్వాత కొత్త చీఫ్ ను ప్రకటించనున్నారు.
అటు పీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్లో విపరీతమైన పోటీ నెలకొంది. సీనియర్లంతా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. విడివడిగా సమావేశాలు ఏర్పాటు చేసి మంతనాలు జరిపారు.