ఐపీఎల్ 2020
సిరీస్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన తమిళనాడు క్రికెటర్ వరుణ్ చక్రవర్తి
తన చిరకాల ప్రేయసిని వివాహ మాడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున
తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. తన రిస్ట్
స్పిన్ బౌలింగ్తో అభిమానుల దృష్టిని ఆకట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్
మ్యాచ్ల సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని వరుణ్ చక్రవర్తితో తీసిన
ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. 29 ఏళ్ల వరుణ్ చక్రవర్తి 13
మ్యాచుల్లో 6.85 ఎకానమీ రేట్తో 17 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ సిరీస్లో మంచి
ప్రదర్శన కనబరచడంతో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టులో వరుణ్ చక్రవర్తి
ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా అతను జట్టులో చోటుచేసుకోలేదు. ఆస్ట్రేలియా సిరీస్
లో టీ20 జట్టులో వరుణ్కు చోటు లభించినప్పటికీ
దురదృష్టవశాత్తు భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. ఇదిలావుండగా ఇటీవల వరుణ్ చక్రవర్తి
తమిళ నటుడు విజయ్ ను కలవడం, అతనితో దిగిన
ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం వరుణ చక్రవర్తి తల్లిదండ్రుల
సమ్మతితో తన చిరకాల ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. ఆయన పెళ్లి సందర్భంగా తీసిన
ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుణ్ చక్రవర్తి పెళ్లి ఫోటోను చూసిన
క్రికెట్ అభిమానులు అందరూ ఆయనను అభినందించారు.