నెల్లూరు జిల్లా కోవూరు
మండలం పడుగుపాడు సొసైటీ ఛైర్మన్ ములుముడి సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో
మరణించాడు. కావలి సమీపంలోని తెట్టు దగ్గర రైలు పట్టాలపై అతడి మృతదేహం లభ్యమైంది.
మృతుడిని బుధవారం గుర్తు
తెలియని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు మృతుడి భార్య చెబుతున్నారు. భర్త
కనిపించడం లేదంటూ కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు
చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సుబ్బరామిరెడ్డిని
గాలించే సయమంలో ఫిర్యాదు ఇచ్చిన రోజు అతడి
మృతదేహం రైలు పట్టాలపై పోలీసులకు కనిపించింది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు
చేసిన పోలీసులు అతడ్ని ఎవరు కిడ్నాప్
చేశారు ఎందుకు హత్య చేసారనే అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు కోవూరు ఎమ్మెల్యే
ప్రసన్నకుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు కూడా కేసును సీరియస్గా
తీసుకున్నారు. సుబ్బరామిరెడ్డి మరణంపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.