ప్రభాస్ లేదా ఎన్టీఆర్ తో నా తర్వాత సినిమా అని ప్రకటించిన స్టార్ డైరెక్టర్


కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్ ..ప్రస్తుతం కెజిఎఫ్ 2 సినిమా చిత్రీకరణలో బిజీ గా ఉన్నారు..అయితే ఇది షూటింగ్ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమా మీద అనేక ఊహాగానాలు వస్తున్నాయి... టాలీవుడ్ హీరోలు కూడా అతడితో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇపటికే ప్రశాంత్ మైత్రి మేకర్స్‌తో ఓ ఒప్పందం చేసుకున్నాడు. అయితే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో ప్రశాంత్ ఓ సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తారక్ ఇప్పటికే ఓ మంచి సినిమా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌టీఆర్ ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో ప్రశాంత్‌తో సినిమా చేస్తాడనీ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వాటిని నిజం చేస్తూ ఓ మూవీ క్రిటిక్ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ తన తరువాతి సినిమాను టాలీవుడ్ హీరోలు ప్రభాస్ లేదా ఎన్‌టీఆర్‌తో చేసే వార్త వాస్తం అంటూ ఆట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుందని అన్నారు