హోరాహోరీగా సాగిన దుబ్బాక
ఉప ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని
సొంతం చేసుకుంది. అయితే తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో దీనిపై సీఎం
కేసీఆర్ స్పందించారు.
దుబ్బాకలో బీజేపీ
సాధించిన విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్
సూచించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో
టీఆర్ఎస్ ఓటమి చెందడంపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి
సానుభూతి కలిసొచ్చిందని అభిప్రాయపడినట్టు సమాచారం.
దుబ్బాక ఫలితం చూసి
పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
ప్రజల్లో ప్రభుత్వంపై
వ్యతిరేకత పెద్దగా లేదని ఆయన నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో
బీజేపీ అబద్ధాలకు ప్రచారం చేస్తోందని వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన
పార్టీ నేతలను ఆదేశించారు.