కర్ణాటక శాసన మండలి
డిప్యూటీ స్పీకర్ ధర్మేగౌడ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.డిప్యూటీ
స్పీకర్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్య సంబంధించి
ధర్మేగౌడ లేఖ రాసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ధర్మేగౌడ శాంత్రో కారులో
ఇంటి నుంచి వెళ్లిపోయి చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు, సహాయకులు అతని కోసం వెతకగా ఆయన మృతదేహం చిక్కమగలూరు
జిల్లా కోడూరు తాలూకా గుణసాగర ప్రాంతంలో లభ్యమైంది. అతని ఆత్మహత్యకు గల కారణాలు
ఇంకా తెలియరాలేదు. ధర్మే గౌడ మృతి పట్ల మాజీ ప్రధాని దేవెగౌడ సంతాపం తెలిపారు.