Breaking News: ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం...!

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. టిఆర్ఎస్ కు 532 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్ధికి 39 , కాంగ్రెస్ అభ్యర్ధికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి.

పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఓట్ల లెక్కింపు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఈ ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. మొత్తం 824 ఓట్లకు 823 ఓట్లు పోలయ్యాయి. రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటిలో మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కించారు.

ఇందుకోసం 6 టేబుళ్లను ఏర్పాటు చేశారు. యాభై పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను బ్యాలెట్ బాక్సుల నుంచి ఒకచోట కుప్పగా పోసి వ్యాలిడ్ ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఫలితాలను వెల్లడించారు అధికారులు.