ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు కల్వకుంట్ల కవిత. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన కవితకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన స్థానిక సంస్థల ప్రతినిధులతో కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఇటీవల నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు కవిత. మొత్తం 823 ఓట్లు పోలైతే అందులో 728 ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే.