విరాళాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్


వరద సాయం, విరాళాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో సినిమా స్టార్లు చేసిన సాయం తక్కువని వస్తున్న అభిప్రాయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

సినిమా వాళ్లకు పేరు ఎక్కువ ఉంటుంది ఉంటుంది కానీ డబ్బు ఉండదని పవన్ అన్నారు. సినిమా వాళ్ళతో పోలిస్తే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద బాగా డబ్బు ఉంటుందన్నారు. నేతలు దీన్ని ఎన్నికల పెట్టుబడిగా భావించి విరాళాలు ఇవ్వాలని కోరారు పవన్. తెలంగాణాలో ప్రో యాక్టీవ్ ముఖ్యమంత్రి ఉండటంతో అడిగిన వెంటనే అంతా విరాళాలు ఇస్తున్నారని చెప్పారు పవన్.

కాగా..వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారాయన. వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు పవన్. అటు సీఎం కేసీఆర్‌ పిలుపుతో... చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు.