భారీ తుఫానుగా
ఆవిర్భవించిన నివర్ తుఫాను వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నష్టం వాటిల్లిన
విషయం తెలిసిందే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్
పర్యటించనున్నారు. డిసెంబర్ 2వతేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు
జిల్లాల్లో పవన్ పర్యటన సాగుతుంది. తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో పవన్ ఈ
సందర్భంగా ముఖాముఖి నిర్వహిస్తారు.
నివర్ తుఫాను వల్ల
రైతులకు కలిగిన నష్టాలపై కృష్ణా జిల్లా
ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డలో
ఆయన పర్యటన జరగనుంది. గుంటూరు జిల్లాలో
భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు
కొలకలూరుల్లో పవన్ పర్యటిస్తారు. ఈ తుఫాను వల్ల పంటలకు భారీగానే నష్టాలు
వాటిల్లింది.
ఆ తరువాత డిసెంబర్ 3
వతేదీన తిరుపతి చేరుకుని చిత్తూరుజిల్లాలో పర్యటిస్తారు. డిసెంబర్ 4
వతేదీన శ్రీకాళహస్తిలో పవన్ పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను
పవన్ పరామర్శిస్తారు. ఇటీవలి తుఫాన్ దెబ్బకు అపార పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను
పవన్ స్వయంగా పరిశీలిస్తారు. నష్టం ఏర్పడిన ప్రాంతాల్లో పర్యటించి వారిని
పరామర్శించనున్నారు.