ఆంధ్రప్రదేశ్ సీఎం
జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ ప్రయాణం చేసి అక్కడ బిజెపి నాయకులతో సమావేశం
కానున్నారు. రేపు జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు
సమాచారం.
ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి అమరావతి నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల 15
నిమిషాలకు ఢిల్లీ చేరుకొని ఉన్నట్లు తెలిసింది.
ఢిల్లీ పర్యటనలో జగన్
మోహన్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మన
ముఖ్యమంత్రి రేపు ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు పరచేందుకు మరియు
పోలవరం ప్రాజెక్టుకు కావలసిన నిధులు మంజూరు చేయుటకు రేపు రాత్రి కేంద్ర హోంమంత్రి
అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం.