అమెరికా అధ్యక్షుడుగా
ఎన్నికైన బైడెన్ కుమార్తె యాష్లే పరిపాలనలో అధికారం చెలాయించే అవకాశం ఉందాని
చూడాల్సివుంది. ఐదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా అమెరికా అధ్యక్షుడి
కావాలనే కలను మూడో ప్రయత్నంలో జో బైడెన్ సాకారం చేసుకున్నారు. రెండుసార్లు
ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో 1988 మరియు 2008లో
అధ్యక్ష పదవి కోసం పోటీపడినప్పటికీ సొంత పార్టీలోనే చుక్కెదురయ్యింది. కానీ, మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. బైడెన్ సతీమణి
జిల్ ప్రథమ మహిళగా శ్వేతసౌధంలో అడుగుపెట్టనుండగా వారి కుమార్తె యాష్లే బైడెన్
ఫస్ట్ డాటర్ హోదా పొందనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ గత
నాలుగేళ్లుగా వైట్హౌస్ను తన కనుసన్నలతోనే శాసించారు. ట్రంప్ సలహాదారునిగా చక్రం
తిప్పిన ఇవాంకా అధికారాన్ని చెలాయించారు. ట్రంప్ హయాంలో అత్యంత శక్తివంతమైన
పదవులను అనుభవించిన ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నర్లను త్వరలోనే
సాగనంపనున్నారు.
ప్రస్తుతం వారి స్థానాలను
బైడెన్ కుమార్తె యాష్లే, అల్లుడు డాక్టర్ హోవార్డ్ క్రెయిన్ భర్తీచేయనున్నారు.
అయితే, ఇవాంకా
మాదిరిగా యాష్లే అధికారం చెలాయించే అవకాశం కనిపించడం లేదు. ఇన్స్టాగ్రామ్లో
ఆమెకు ఓ ప్రైవేట్ ఖాతా మాత్రమే ఉంది. యాష్లే జన్మించే సమయానికే జో బిడెన్ సెనేటర్గా
ఉన్నారు. పుట్టుకతోనే రాజకీయ వాతావరణంతోపాటు సోదరులు హంటర్, బ్యూ
అనురాగం, అప్యాయతల
మధ్య పెరిగారు. కానీ, బ్యూ 2015లో కేన్సర్తో చనిపోయారు. అయితే, గతంలో
డ్రగ్స్తో పట్టుబడిన యాష్లే,
2002లో ఓ పోలీస్ అధికారిని అడ్డుకున్న కేసులో
అరెస్టయ్యారు. ఇక, బైడెన్ ఎన్నికల ప్రచారంలో తన భర్త హోవార్డ్ విషయంలో
విమర్శలు ఎదుర్కొన్నారు. సామాజిక న్యాయ పోరాటాన్ని వృత్తిగా చేసుకున్న యాష్లే
కేవలం దానిపైనే దృష్టి పెట్టింది.
అమెరికా అధ్యక్షా
ఎన్నికల్లో తండ్రి బైడెన్ వెంట ర్యాలీలో పాల్గొన్నారు. డెమొక్రటిక్ నేషనల్
కన్వెన్షన్లో పాల్గొన్నా బహిరంగ వేదికలపై చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రజా సేవ
పట్ల అభిరుచి తన డీఎన్ఏలోనే ఉందని 2017లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాష్లే వివరించారు. తండ్రి
బైడెన్ జీవితకాలం రాజకీయాల్లోనే ఉన్నారని, తల్లి జిల్ ఉపాధ్యాయునిగా సేవ చేస్తున్నారని అన్నారు.
నేను చిన్నతనం నుంచి జంతువులను నిజంగా ప్రేమిస్తున్నాను బోన్నే బెల్ లిప్ గ్లోస్ జంతువులను
పరిశీలించేదాన్ని ట్యూనా నెట్స్లో చిక్కుకున్న డాల్ఫిన్ల దుస్థితి గురించి లేఖలు
రాయడం పాఠశాల వయసులోనే ప్రారంభించాను. డాల్ఫిన్ సంరక్షణ చట్టం కోసం పోరాటం చేసిన
కాంగ్రెస్ ప్రతినిధి బార్బరా బాక్సర్కు నన్ను మా నాన్న పరిచయం చేశారు అని
పేర్కొన్నారు. బైడెన్ అధికారం చేప్పట్టిన తరువాత మన దేశంతో మంచి సంబంధాలను
కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు.