ఇండియన్ క్రికెట్ లో కీపర్ గా ధోని స్థానాన్ని భర్తీ చేయాలంటే సాహసం అనే చెప్పాలి ..అయితే ధోని రిటైర్మెంట్ సమయం దగ్గర పడటంతో ధోని వారసుడి గురించి వెతికే పనిలో పడింది టీమిండియా ..ధోని వారసుడిగా మన్నలను అందుకున్న రిషబ్ పంత్ ఆ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు ..
ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ యువ కీపర్ ఎన్ని అవకాశాలు ఇచ్చిన వృధా చేస్తున్నాడు ..దీనితో టీంఇండియాలో పంత్ స్థానంలో రాహుల్ ను కొత్త కీపర్ గా నియమించడం జరిగింది..అయితే కోహ్లీతో పాటు టీమిండియా మేనేజ్మెంట్ మరొక ఛాన్స్ అతనికి ఇవ్వాలని పఠాన్ సూచించాడు.
రిషబ్ పంత్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి.. యంగ్ క్రికెటర్, చాలా టాలెంట్ ఉన్న ఆటగాడిగా అందరూ కితాబిస్తున్నారు. దాంతో.. అతనిపై అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. ఒకవేళ ఆ అంచనాల్ని మనం తీసివేయగలిగితే..? అతను స్వేచ్ఛగా రాణించే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ అతిగా రిషబ్ పంత్కి మద్దతు ఇవ్వడంతో అందరి చూపు కూడా పంత్పై నిలిచింది. ఇప్పటికీ పంత్కి వెనుకవైపు నుంచి కోహ్లీ లేదా మేనేజ్మెంట్ ఒక్క కిక్ ఇవ్వగలిగితే.. అతను సెట్ అవుతాడు’’ అని పఠాన్ వెల్లడించాడు.