IPL 2020 RCB vs KXIP Live: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన..!

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ షార్జా వేదికగా రసవత్తరమైన పోరు జరుగుతోంది. విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలబడుతోంది.

ఇప్పటివరకూ బెంగళూరు ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కేవలం ఒకదానిలోనే గెలుపొందింది. ఇక ఈ టోర్నీలో నిలవాలంటే.. పంజాబ్ ఇప్పటి నుంచి దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత జట్టుతోనే బెంగళూరు బరిలోకి దిగుతుండగా… పంజాబ్ మూడు మార్పులు చేసింది. ఈ మ్యాచ్ తో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బరిలోకి దిగుతున్నాడు.