ఐపీఎల్-13లో మరో కీలక పోరు జరిగింది. గత మ్యాచ్ల్లో అద్భుతమైన ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రెండు జట్లు ఇవాళ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. సోమవారం రాత్రి షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడ్డాయి.
మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టార్గెట్ ఛేదించడంలో కోల్కతా పూర్తిగా విఫలమైంది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.