IPL 2020 Final: ఢీ అంటే ఢీ...!

కరోనా కారణంగా ఎంటర్‌టైన్మెంట్‌కు దూరమైన అభిమానులకు దాదాపు రెండు నెలలు పాటు పూర్తి వినోదాన్ని పంచిన ఐపీఎల్ నేటితో ముగియనుంది.

ఇవాళ దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐదో టైటిల్‌పై ముంబై కన్నేయగా.. తొలిసారి కప్పు గెలవాలని ఢిల్లీ కసితో ఉంది.

ఇక ఈ సీజన్‌లో ఇరు జట్లూ మూడుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ ముంబై ఇండియన్సే పైచేయి సాధించింది.