IPL 2020 DC VS CSK : చెన్నైపై ఢిల్లీ విజయం...!

ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో శతకం నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో షార్జా వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (101 నాటౌట్: 58 బంతుల్లో 14x4, 1x6) అజేయ శతకం బాదడం ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో తొలుత డుప్లెసిస్ (58: 47 బంతుల్లో 6x4, 2x6), రవీంద్ర జడేజా (33 నాటౌట్: 13 బంతుల్లో 4x6) దూకుడుగా ఆడటంతో 4 వికెట్ల నష్టానికి చెన్నై 179 పరుగులు చేయగా.. ఛేదనలో ధావన్‌తో పాటు ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ (21 నాటౌట్: 5 బంతుల్లో 3x6) బ్యాట్ ఝళిపించడంతో లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఢిల్లీ ఛేదించింది.

చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరమవగా.. బౌలింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజాకి అక్షర్ పటేల్ మూడు సిక్సర్లు బాదేశాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో శిఖర్ ధావన్‌కి ఇదే తొలి శతకంకాగా.. సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మళ్లీ నెం.1 స్థానానికి దూసుకెళ్లింది.