తమిళనాడు మాజీ
ముఖ్యమంత్రి జయలలిత వారసులెవరో తెలిసి పోయింది. మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపను అమ్మ లీగల్ హెయిర్స్గా
మద్రాసు హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆమెకు
ఎన్ని ఆస్తులున్నాయి, వాటి
విలువెంతని చర్చ నడుస్తోంది. కోర్టుకు రిపోర్టు ఇచ్చిన టైమ్లో అమ్మ
ఆస్తులపై 3 రకాల
లెక్కలను కోర్టు ముందుంచారు. దీపక్, దీపనేమో
రూ. 188 కోట్లని, తమిళనాడు
సర్కారేమో రూ.913
కోట్లని చెప్పారు. ఆ విచారణ టైమ్లో ఆస్తుల విలువ రూ. వెయ్యి కోట్లకు పైన
ఉంటుందన్నారు. ఈ ఆస్తులన్నీ 1991 నుంచి
1996 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు పొందినవే. ఈ 25 ఏండ్లలో ఆమె ఆస్తులు పెరిగే ఉంటాయని అనుకుంటున్నారు.
సినిమాల్లో నటిస్తున్న
సమయం లో హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో విలువైన ఆస్తులను
జయలలిత కొన్నారు. సిటీలో ఆమెకున్న కమర్షియల్, రెసిడెన్షియల్, ఫామ్ ల్యాండ్స్ను విశ్రాంతికి
వాడుకునే వారని చెబుతుంటారు. 1996
ఎన్నికల్లో ఓడిపోయాక మూడేళ్ల పాటు జయలలిత నగరానికి తరుచూ వచ్చి పోయేవారని తెలిసింది.
పుస్తకాలు చదివేందుకు, తల్లిదండ్రులతో గడిపేందుకే ప్రస్తుతం మేడ్చల్ జిల్లా
పరిధిలోని కొంపల్లిలో ఉన్న 14 ఎకరాల
జేజే గార్డెన్ ఫామ్ హౌజ్కు వచ్చేవారు. బత్తాయి, ద్రాక్ష తోటలతో ఆ ఫామ్ హౌజ్ను అందంగా
తీర్చిదిద్దారు. వచ్చినప్పుడల్లా కనీసం వారం పాటు సిటీలోనే గడిపేవారని.. ఆ టైమ్లో
అభిమానులు, పార్టీ
లీడర్లకు అనుమతి ఉండేది కాదని తెలిసింది.
వెస్ట్ మారేడ్పల్లిలోని
రాధిక కాలనీలో జయలలితకు సొంతిళ్లు ఉంది. కంటోన్మెంట్ బోర్డు
వర్గాలు అప్పట్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు కూడా పంపారు.
ఇంటిముందు శశికళ నటరాజన్ అని ఇప్పటికీ ఉందని స్థానికులు చెబుతారు. అలాగే 1967 టైమ్లో
తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉండటంతో చెన్నై టు హైదరాబాద్
వస్తూ పోతుండే వారని.. ఆ టైమ్లో తల్లి సంధ్యతో కలిసి ఉండేందుకు శ్రీనగర్
కాలనీలో 600 గజాల్లో ఓ ఇంటిని కొన్నారని సమాచారం. ప్రస్తుతం ఆ
మూడంతస్తుల బిల్డింగ్లో యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ సంస్థ కిరాయికి
ఉంటుందని తెలిసింది.
173
ప్రాపర్టీల్లో కనీసం 100
వాటిల్లో అమ్మ పార్ట్నర్గా ఉన్నారు. అమ్మ దగ్గర రూ.5.53 కోట్ల విలువైన జ్యువెల్లరీ, వెండి బట్టలు, రూ. 4 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అయితే 2011 అఫిడవిట్లో జయలలిత తన ఆస్తుల విలువ రూ. 51.4 కోట్లుగా పేర్కొన్నారు. 2016 ఎన్నికల్లో రూ.113.73 కోట్లుగా చూపారు.
జయలలిత ఫేవరెట్
సమ్మర్ ట్రీట్ అయిన కొడనాడ్ టీ ఎస్టేట్ 900కు పైగా ఎకరాల్లో ఉంది. ఇప్పుడు దాని విస్తీర్ణం
రెండింతలై ఉండొచ్చని అంటున్నారు. ఆ ఎస్టేట్ను 1992లో ఆమె కొన్నారు. దాని విలువ ఎకరాకు రూ. కోటి
ఉంటుందని చెబుతున్నారు. ఇక తన ఫ్రెండ్, సహచరురాలు
శశికళ, ఇతర అసోసియేట్స్తో కలిసి 32 కంపెనీలను అమ్మ స్టార్ట్ చేశారు. వాటి
గురించి పెద్దగా వివరాలు తెలియదు.