జార్ఖండ్, ఒడిశా, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి
0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ద్రోణి కూడా ఉన్నది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు పేర్కొన్నారు.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగా మ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గూడూరు వరంగల్ అర్బన్, రూర ల్ జిల్లాల్లో 12
సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.