మూడు సార్లు ప్లాస్మా దానం చేసిన పోలీస్ కానిస్టేబుల్ ను అభినందించిన మంత్రి హరీష్ రావు


ఓ కానిస్టేబుల్ చేసిన మంచి పనికి మంత్రి హరీష్ రావు ఫిదా అయిపోయాడు. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తోంది అంటూ ఆ పోలీసు మీద పొగడ్తల వర్షం కురిపించారు మంత్రి హరీష్. అసలు ఆ కానిస్టేబుల్ ఏం చేసాడంటే... కొన్ని రోజుల కింద కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు కరోనా సోకింది.

కరోనా నుంచి కోలుకున్న చంద్రశేఖర్ ఏకంగా మూడుసార్లు ప్లాస్మా దానం చేసాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనాను గెలవడమే కాకుండా ప్లాస్మా దానం చేసి అందరి మనసులూ గెలిచిన సిద్ధిపేట జిల్లా, రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు అభినందనలు.

మూడుసార్లు ప్లాస్మా దానం చేసిన నీపెద్ద మనసు అందరికీ ఆదర్శం. కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను నీలాంటి యువకులే తొలగించగలరు. తెలంగాణ సమాజం నిన్నుచూసి గర్విస్తోంది. అంటూ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు