కరోనా వైరస్ ప్రజల మధ్య
విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీనిని తరిమి కొట్టుటకు వాక్సిన్
అవసమవుతుంది. దేశంలో ఉన్న ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఎప్పుడూ
చెప్పలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర
ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నేను ఒక్క విషయం
మాత్రం స్పష్టం చేయదలచుకున్నాను.
కరోనా వైరస్ ప్రభావం వల్ల
దేశంలోని జనాభా మొత్తానికి వాక్సినేటింగ్ చేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు.
ఇలాంటి శాస్త్రీయ సంబంధ అంశాలను వాస్తవిక సమాచారం ఆధారంగానే చర్చించాలన్న విషయాన్ని
గుర్తుంచుకోవాలి అని ఆయన అన్నారు.
ప్రపంచంలో మిగిలిన
దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే వుంది. దేశంలో ప్రతి పది
లక్షల మందికి కేవలం 211 మందికి మాత్రమే కరోనా సోకిందని పెద్ద దేశాలతో
పోలిస్తే ప్రతి మిలియన్ కేసుల సంఖ్య ఇండియాలోనే తక్కువని రాజేష్భూషణ్
తెలిపారు. ప్రస్తుతం వాక్సిన్ అందుబాటులోకి వస్తే కూడా అందరూ ప్రజలకు తగినన్ని
సరఫరా చేయడం వీలుకాదు.