ఇంటర్ పరీక్షలకు హాజరుకాని
విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ ఏడాది
మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరుకాని 27,589 మంది విద్యార్థులను
గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
వీరిలో మాల్ ప్రాక్టీస్ కమిటీ
బహిష్కరించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కరోనా నేపథ్యంలో
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.