అక్టోబర్ 7వ తేదీ
వరకు గేట్ 2021 పరీక్ష
ఆన్లైన్ రిజిస్ర్టేషన్ గడువును పొడిగించారు. దీనికి సంబంధించి ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై
అధికారిక వెబ్సైట్ gate.iitb.ac.in.
లో గేట్ పరీక్ష దరఖాస్తు ఫారమ్ను విడుదల చేసింది.
అంతకుముందు గేట్ 2021
పరీక్ష ఆన్లైన్ నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే తాజాగా ఆన్లైన్
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచుతూ
నిర్ణయం ప్రకటించారు.
ఐఐటీ ముంబై ఫిబ్రవరి 2021లో
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ను నిర్వహించనుంది.
ఫిబ్రవరి 5 నుంచి 14 తేదీల్లో పరీక్ష నిర్వహణ జరుగుతుంది.