తమిళనాడులో అధికార
పార్టీ అయిన అన్నా డీఎంకేలో వర్గపోరు ప్రారంభంమైంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ
సీఎం పన్నీర్ సెల్వం మధ్య వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయమై
వివాదం మొదలైంది.
వచ్చే ఏడాది తమిళనాడు
అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న కారణంగా ఆ విషయమై చర్చించేందుకు సోమవారం
చెన్నైలో అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరిగింది. అక్టోబర్ 7న సీఎం
అభ్యర్థిని ఖరారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
దీంతో పార్టీ కార్యవర్గం
రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యవర్గ
సమావేశంలో నిర్ణయించినట్టుగానే అక్టోబర్ 7న సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా అనేది
ఇప్పుడు సస్పెన్స్గా మారింది.