కొడుకు పుట్టాలని కూతురి తల నరికి బలి ఇచ్చిన తండ్రి...!

దేశంలో సాంకేతిక రంగం దూసుకుపోతున్న ఈరోజుల్లో మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న వారు లేకపోలేదు. వాటి మీద విశ్వాసంతో నేటికీ చాలా చోట్ల దారుణాలు జరుగుతున్నాయి.

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి రాంచీలో చోటు చేసుకుంది. మూఢనమ్మకాలపై విశ్వాసంతో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి సొంత కూతురిని కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే..

జార్ఖండ్ రాజధాని రాంచీలో నివసించే సుమన్ నాగసియా(6) దినసరి కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉన్నప్పటికీ కొడుకు కావాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలోనే ఓ మంత్రగాడిని వెళ్లి కలిశాడు.

‘నీ ఆరేళ్ల కూతురును బలిస్తే నీకు మగబిడ్డ పుడతాడని ఆ మాంత్రికుడు చెప్పడంతో విచక్షణ కోల్పోయిన సుమన్ తన కుమార్తెను అత్యంత కిరాతకంగా తల నరికి హత్య చేశాడు.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సుమన్‌ను అదుపులోకి తీసుకుని.. మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.