రైతుల ఆత్మహత్యలు మంచిది కాదు ...శరద్ పవార్


రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు.

అగ్రి చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతుల్లో నలుగురు లేదా ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా విన్నానని చెప్పారు. మారుతున్న ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్నారు.

రైతుల ఆందోళనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. రైతుల సమస్యకు చర్చలు, పరిష్కారం ఉండాలని శరద్ పవార్ సూచించారు.