ప్రముఖ మాజీ క్రికెటర్ గోపాలస్వామి కస్తూరి రంగన్ (89) గుండెపోటుతో బుధవారం తన నివాసంలో కన్నుమూశారు. చామరాజపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.అని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్, అధికార ప్రతినిధి వినయ మృత్యుంజయ తెలిపారు. మాజీ క్రికెటర్-అడ్మినిస్ట్రేటర్ అయిన రంగన్ కేఎస్సీఏ ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యూరేటర్గానూ పనిచేశారు.
1948
నుంచి 1963 మధ్య రంజీ ట్రోఫీలో మైసూర్ తరఫున ఎక్కువగా మ్యాచ్లు ఆడారు.
1962-63లో కర్ణాటకు ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్ అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారని మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశారు. కుడిచేతి మీడియం బౌలర్గా రాణించారు. కస్తూరి రంగన్ మృతికి మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.