పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో భూప్రకంపనలు


పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి.

భూప్రకపంనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) పేర్కొంది.

ఇస్లామాబాద్‌ నగరానికి పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది.

ఒక్కసారిగా ప్రకంనలు చోటు చేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.