పేదలకు డబుల్ బెడ్ రూమ్
ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేసిఆర్ అన్నారు. త్వరలోనే
మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్
చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని
ప్రతిష్టాత్మకంగా . హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80శాతానికి
పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరానికి
సంబంధించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపకాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో
మంత్రులు కేసిఆర్, ప్రశాంత్ రెడ్డి, ఉన్నత స్థాయి
సమావేశం నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ సమావేశానికి హైదరాబాద్కు చెందిన మంత్రులు సీహెచ్
మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్
బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హౌసింగ్
శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నగరంలో చాలా చోట్ల
దాదాపుగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని తెలిపారు. పేదలకు ఇళ్లు అందించేందుకు
చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేసిఆర్ స్పష్టం చేశారు.ఇప్పటికే కొన్నిచోట్ల అర్హులైన
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేశామన్నారు. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి
త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు
అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.