బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన పురందేశ్వరి...!
మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
ఢిల్లీలోని తన ఆఫీస్ ఛాంబర్ లో పండితుల వేద మంత్రాల మధ్య పూజ నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పురందేశ్వరికి రాష్ట్ర, జాతీయ బీజేపీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పురందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.