జీహెచ్ఎంసీ ఎన్నికల
కౌంటింగ్ తుది దశకు చేరింది. మరో గంటలో పూర్తిస్థాయి ఫలితాలు రానున్నాయి.
సాయంత్రం 5 గంటల వరకు 108 స్థానాలలో ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ -42 స్థానాలలో, బీజేపీ -25,
ఎంఐఎం-35 స్థానాలలో విజయం సాధించాయి.
కాంగ్రెస్ రెండుచోట్ల
గెలుపొందింది. మరో 41 డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిలో
టీఆర్ఎస్ 29 స్థానాలలో, బీజేపీ 11 స్థానాలలో, కాంగ్రెస్ ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తుది ఫలితాల కోసం నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు
చూస్తున్నారు.