చెన్నై: తమిళనాడులో కరోనా
పాజిటివ్ కేసుల సంఖ్య 13,191కి చేరింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల
ఇప్పటివరకూ 87 మంది మరణించారు. తమిళనాడులో కరోనా రోజురోజుకూ
విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే తమిళనాడులో 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి
చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ముగ్గురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర
వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. తమిళనాడులో
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,219.
మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో బుధవారం 83
మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
బుధవారం కరోనా నుంచి కోలుకున్న 987 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది.
తమిళనాడులో ఇప్పటివరకూ 5,882 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.