మణిపుర్ సీఎం ఎన్. బీరెన్సింగ్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు.
కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారంతా వెంటనే కొవిడ్ టెస్టు చేయించుకోవాలి’ అని ట్వీట్ చేశారు బీరెన్ సింగ్. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని పేర్కొన్నారు.
దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 41,100 మందికి పాజిటివ్గా తేలింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో తాజాగా 42,156 మంది వైరస్ను జయించారు.
కేసుల సంఖ్య 5 లక్షల దిగువనే కొనసాగుతోంది.నవంబరు 14 వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల 48 లక్షల 36 వేలకుపైగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.