Breaking News: డిప్యూటీ సీఎం కి కరోనా వైరస్ పాజిటివ్...!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవలసిన పని లేదని ఆయన అన్నారు.

డాక్టర్ల సలహాపై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రజలమధ్యకు వస్తానన్నారు. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో సుమారు డజను మంది మంత్రులు కోవిడ్ కి గురయ్యారు.