కరోనా ఎవరిని వదలి
పెట్టడం లేదు. ప్రస్తుతం ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీకి కరోనా
వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోమవారం వెల్లడించారు. క్వారంటైన్
పద్ధతులు పాటించినప్పటికీ కరోనా వైరస్ బారినపడినట్లు ట్వీట్ చేశారు. కరోనా
ముప్పు లేని అదృష్టవంతులైన వ్యక్తులెవరూ లేరు.
తాను వైరస్ బారిన పడకుండా
క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. విటమిన్ మాత్రలు ఎక్కువగా తీసుకుంటున్నాను.
ఐసొలేషన్లో ఉంటానని ప్రామిస్ చేస్తున్నా అని తెలిపారు.
వైరస్ సోకినప్పటికీ
అధికార విధులు నిర్వహిస్తానని చాలా మంది
లాగే నేను కూడా కరోనాను అదిగమిస్తానని
అంతా మంచే జరుగుతుంది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు ఉక్రేనియన్లో
ఇప్పటి వరకు 4.69 లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగుచూడగా 8,500
మందికిపైగా మరణించారు. వైరస్ తీవ్రత గత కొంత కాలంగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా
విస్తరిస్తున్నది.