కరోనా తో బాధపడుతున్న ఓ గర్భిణి బుధవారం కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి ఈ నెల 25న పరీక్షలు నిర్వహించగా కరోనాపాజిటివ్గా
తేలింది. అయితే బుధవారం ఆమె ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. పుట్టిన
పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా
ఆస్బెస్టాస్ కాలనీ నెహ్రునగర్కు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు
రావడంతో 16న నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించగా 17న ఆమె ఆడ శిశువుకు
జన్మనిచ్చింది. అయితే 25న చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ
నిలోఫర్కు తరలించగా అనుమానం వచ్చిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా
పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ అదే రోజు చిన్నారి
మృత్యువాత పడింది.