సీఎం అరవింద్ కేజ్రీవాల్కు
కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది. ఉదయం పరీక్షలు చేయగా రిపోర్టుల్లో నెగెటివ్
వచ్చింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజులుగా జ్వరం, గొంతు
నొప్పితో బాధపడుతున్నారు.
ఆదివారం నుంచి ఆయన సెల్ఫ్
ఐసోలేషన్లోనే ఉన్నారు. అన్ని అధికారిక, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలు
కనిపించడంతో ఇవాళ ఉదయం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కానీ రిపోర్టులో నెగెటివ్
రావడంతో అధికార యంత్రాంగం, కేజ్రీవాల్ కుటుంబం ఊపిరిపీల్చుకుంది.