బుధవారం నుంచి మూడు రోజుల
పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
చేయబోతున్నారు.
పులివెందులలో ఏపీ కార్ల్
భవనాల నిర్మాణం,ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పార్కులో పలు అభివృద్ధి
కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు.
ఈనెల 23వతేదీ
సాయంత్రం తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి
రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్లో బస చేయనున్నారు.
25వతేదీ మధ్యాహ్నం కడప నుంచి విమానంలో రాజమండ్రి
చేరుకుంటారు. కొత్తపల్లిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని
సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.