గ్రేటర్ ఎన్నికలకోసం కొంతమంది నేతలు సంక్రాంతి గంగిరెద్దుల్లా వచ్చి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు.
బిజెపి నాయకత్వం లోపం వల్ల నేతలను తయారుచేసుకోలేక కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కాషాయ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. జనసేనతో పొత్తు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబితే.. ఆయనకి సమాచారం లేకుండానే పవన్ కల్యాణ్ మద్దతును కిషన్రెడ్డి, లక్ష్మణ్ కోరారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్పై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారని.. తాను ఆయనపైనే ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.