నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ ఇటీవల కరోనా బారీన పడ్డ విషయం తెలిసిందే.. ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. ఆయన చెన్నై నందబాక్కంలోని మియాట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు.
వారం పాటు చికిత్స తీసుకున్న ఆయన బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే... తాజాగా మరోసారి కెప్టెన్ విజయ్కాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేస్తూ...డీఎండీకే పార్టీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విజయ్కాంత్..తన తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం తాజాగా చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మకండి అని ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు...విజయ్కాంత్ కూమారుడు కూడా తమ నాన్న ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.