పార్లమెంటులో అప్రజాస్వామికంగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమోదించిన మూడు రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 2020 రద్దుచేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల డిమాండ్లకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతును ఇస్తున్నట్లు సర్కిల్ కార్యదర్శి జే సంపత్ రావు ప్రకటించారు.