త్వరలో యూపీలో జరగనున్న
ఉపఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ పోటీచేయాలని
నిర్ణయించింది. ఉపఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు
ఇతర పార్టీలకు మద్దతునిస్తూ వస్తున్నది.
గత కొంత కాలంగా
రాష్ట్రంలో పార్టీ ప్రాభవాన్ని కోల్పోతుండటంతోపాటు, 2022లో అసెంబ్లీకి ఎన్నికలు
జరగనున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించింది. అదేవిధంగా
ఎన్నికల ద్వారా ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవచ్చని, పార్టీ
కార్యకర్తలను కాపాడుకోవచ్చని పార్టీ నేతలు అభిప్రాయ౦.
రాష్ట్రంలోని నౌగావన్, డియోరియా, ఘటమ్పూర్, బులంద్షహర్, తుండ్లా, బంగారము, మలహని, సువార్
(రాంపూర్) స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఇందులో ఆరు స్థానాల్లో బీజేపీ
గెలుపొందగా, రెండు సీట్లలో (మలహని, సువార్)
సమాజ్వాదీ పార్టీ గెలుపొందింది.