గత కొద్దిరోజులుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ శివసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి...అయితే ఆ వార్తలను ఊర్మిళ కొట్టిపారేసింది...కానీ తాజాగా ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శివసేన లో చేరింది...సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అంతేకాక గవర్నర్ కోటా నుంచి ఆ పార్టీ తరపున ఆమె మహారాష్ష్ర్ట శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ష్ర్ట పాలక మహావికాస్ అగాది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమి ఇప్పటికే 11 మంది పేర్లతోపాటూ ఆమె పేరును కూడా మహారాష్ష్ర్ట గవర్నర్ కోశ్యారీకి పంపడం జరిగింది. అయితే కేబినేట్ సిపారసు మేరకు మహారాష్ట్ర శాసన ఎగువ సభకు 12 మంది సభ్యుల జాబితాకు గవర్నర్ కోశ్యారీ ఆమోదం తెలపాల్సి ఉంది.
46 సంవత్సరాల ఊర్మిళ మతోంద్కర్ గత మార్చిలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సెప్టెంబర్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత రాజకీయాలతో ఆమె పార్టీని వీడారు..